హరిద్వార్ యొక్క పవిత్రతను సంధ్యాసమయములలో ఇచ్చే హారతి మరింత ఇనుమడింప చేస్తుంది. ఆ సమయంలో భక్తులు చేసే ప్రార్థనలతో, హారతి ఇస్తూ, పూజారులు చేసే ఘంటరావాలతో ఆ ప్రాంగణం ఒక వింతైన, భక్తిపారవశ్యమైన స్థితిలో ఉండి భక్తుల ఒడలను గగర్పోడుస్తుంటుంది. 'ఈ మహాహారతిని' దర్శించే దృశ్యం వర్ణనాతీతంగా, అపూర్వమైన ఆధ్యాత్మిక సన్నివేశాలుగా వివరణ చేయవచ్చు. ఆధ్యాత్మిక పారవశ్యానికి, ఆత్మప్రక్షాళనను, భగవంతుని కటాక్షాన్ని భక్తునిపై ప్రసరింపచేసే ఈ అద్భుతమైన, 'మహాహారతిని ' ప్రతి భక్తుడు వీక్షించి ధన్యుడవవలసిందే. భక్తులు పూలసజ్జలో జ్యోతిని వెలిగించి సజ్జను గంగానది నీటిపై వదులుతారు. వేలమంది భక్తులు నిర్వహించే ఈ దృశ్యం స్వయంగా నక్షత్రాలే సామూహికంగా తరలివచ్చి గంగమ్మ తల్లి కాలికి నమస్కరించుతున్నాయా అన్నట్లుగా ఆ ప్రదేశం మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది.
చూడవలసినవి: దక్ష ప్రజాపతి ఆలయం, గంగా మాత ఆలయం, మానసా దేవి ఆలయం
వసతి : హరిద్వార్ లో చాలా హోటల్స్ మరియు సత్రాలు కూడా కలవు.
అందుబాటు : రైల్వే స్టేషన్ నుండి ఆటోలు మరియు రిక్షాలు లభించును.