దేవేంద్రుడు తపస్సు చేసి పాపవిముక్తుడైన ఈ దివ్య ప్రదేశములో స్థానేశ్వరాలయము ఉంది. భక్తులు (మగవారు మాత్రమే) చొక్కాలు తీసి స్వామిని దర్శించుకోవాలి. కళ్యాణమండపము, సంగీత స్థంభాలుగల ఈ ప్రదేశము దగ్గరలో అత్రి, అనసూయ తపస్సు చేసిన ప్రదేశాలున్నాయి.
చూడవలసినవి: శుచీంద్రం కోయిల్, అమ్మన్ కోయిల్
వసతి : నాగర్ కోయిల్ మరియు కన్యాకుమారిలలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : నాగర్ కోయిల్ నుండి మరియు కన్యాకుమారి నుండి లోకల్ బస్సు సౌకర్యం కలదు.