చూడవలసినవి: గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం
వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు.
ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి పట్టణము నందు బీచ్ రోడ్ లో కలదు. దీనిని 1956 లో జాతిపిత అయిన మహాత్మాగాంధి జ్ఞాపకార్ధంగా దీనిని నిర్మించారు. మహాత్మాగాంధి అస్తికలను కన్యాకుమారిలోని త్రివేణి సంగమంలో కలిపే ముందు ప్రజల సందర్శనార్ధం ఇక్కడ ఉంచారు. మహాత్మాగాంధి 1925 లో మరియు 1937 లో, రెండు సార్లు కన్యాకుమరిని దర్శించారు. 1948 లో గాంధిజీ అస్తికలను కన్యాకుమారిలోని సముద్రజలాలో కలిపారు. దానికి గుర్తుగా ఇక్కడ మహాత్మాగాంధి మెమోరియల్ నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణపు ఆకారం యొక్క పైకప్పు 78 అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది. ఇది (79) గాంధీజీ యొక్క వయసును (చనిపోయేనాటికి) సూచిస్తుంది. ఇందులో గాంధీజీ జీవితంలోని వివిధ ఘట్టాలను తెలిపే ఫోటోలు కలవు. ప్రవేశ సమయము ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరకు. ప్రవేశం ఉచితం.
చూడవలసినవి: గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు.
0 Comments
ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి పట్టణము నందు అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం మరియు బంగాళాఖాతం కలిసే ప్రదేశంలో వివేకానంద రాక్ మెమోరియల్ పక్కన ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి ఫెర్రీ సౌకర్యం కలదు (ఉదయం 8 నుండి సాయత్రం 4 వరకు మాత్రమే). వివేకానంద రాక్ మెమోరియల్ దర్శించుకున్న తరవాత యాత్రికులను ఫెర్రీలో తిరువల్లువార్ విగ్రహం దగ్గరికి తీసుకువెళ్తారు. ఇది సముద్ర తీరంనుండి 200 మీటర్ల దూరంలో, సముద్రంలో ఒక పెద్ద రాయిపైన దీనిని నిర్మించారు.
తిరువల్లువార్ తమిళనాడుకు చెందిన సుప్రసిద్ధ కవి, తిరుక్కురళ్ ను రచించినవాడు. తిరువల్లువార్ విగ్రహ పీఠభాగం 38 అడుగుల ఎత్తు, తిరువల్లువార్ విగ్రహం 95 అడుగుల ఎత్తు , మొత్తంగా 133 అడుగుల ఎత్తులో ఇది మనకు దర్శనమిస్తుంది. విగ్రహ పీఠభాగాన్ని లోపల మూడు అంతస్తులుగా నిర్మించారు. లోపల నుండి విగ్రహం దగ్గరకు వెళ్ళడానికి వీలుగా 140 మెట్లు ( 70 పైకి ఎక్కడానికి, 70 కిందికి దిగడానికి ) నిర్మించారు. విగ్రహం బరువు 2000 టన్నులు మరియు మొత్తం నిర్మాణం బరువు 7000 టన్నులు. సందర్శన వేళలు: ఉదయం 8 నుండి సాయంతం 4 గం వరకు మాత్రమే. చూడవలసినవి: వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కన్యాకుమారి నుండి ఫెర్రీ సౌకర్యం కలదు ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి పట్టణము నందు అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం మరియు బంగాళాఖాతం కలిసే ప్రదేశంలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి ఫెర్రీ సౌకర్యం కలదు (ఉదయం 8 నుండి సాయత్రం 4 వరకు మాత్రమే). ఇది సముద్ర తీరంనుండి 200 మీటర్ల దూరంలో, సముద్రంలో ఒక పెద్ద రాయిపైన కలదు.
స్వామి వివేకానంద తనకు కాళికాదేవిపైన భక్తి ప్రేరణతో తపస్సు చేయుటకు కన్యాకుమారి ఒడ్డుకు చేరినాడు. సముద్రంపై అక్కడ ఉన్న రాయిని చేరాడు. అక్కడ మూడు రాత్రుళ్లు, మూడు పగళ్ళు ధ్యానంలో కూర్చొనినాడు. అక్కడ ఉన్న శ్రీ పాదశిల క్రమముగా వివేకానంద శిలగా మారింది. వివేకానంద మండపము ప్రధాన ద్వారములకు రెండు ప్రక్కలా నల్లరాతి ఏనుగులు, దూలములపై సాంప్రదాయక చిహ్నమైన గజపూర్ణ కుంభం చెక్కినారు. మండపములోని గదులలో శ్రీ రామకృష్ణ పరమహంస , శ్రీ శారదాదేవి యొక్క సజీవం అనిపించే చిత్ర పటములు కలవు. ధ్యాన మందిరంలో ఓం గుర్తును ప్రణవ పీఠంపై ప్రతిష్టించబడినది. ఇక్కడ ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. సముద్రపు ఒడ్డున కూర్చుని ప్రకృతి అందాలను చూసి ఆనందించవలసిందే కాని వర్ణించరానిది. చూడవలసినవి: వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కన్యాకుమారి నుండి ఫెర్రీ సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కోయంబత్తూర్ జిల్లాలో కలదు. పొల్లాచి నుండి 8 కి.మీ దూరంలో, అలియార్ నది ఒడ్డున కలదు. ఇక్కడికి తమిళనాడు నుండే కాక కేరళ నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఈ దర్గాను సందర్శిస్తే మనలో పేరుకుపోయిన చెడు భావాలు తొలగిపోతాయని నమ్మిక. దర్గాలో ఒక సమాధి కలదు. అలియార్ నదిలో స్నానమాచరించి భక్తులు ఈ దర్గాను దర్శించుకుంటారు.
చూడవలసినవి: దర్గా, ప్రసంద వినాయగర్ టెంపుల్, మాసాని అమ్మన్ తిరుకోయిల్ వసతి : కోయంబత్తూర్ మరియు పొల్లాచి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కోయంబత్తూర్ జిల్లాలో కలదు. కోయంబత్తూర్ నుండి 55 కి.మీ దూరంలో, పొల్లాచి కి సమీపంలో అనైమలై అనే గ్రామంలో కలదు. ఈ గుడి అమ్మవారికి చెందినది. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారు చాలా శక్తివంతమైనదని, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి. ఇక్క ఉన్న అమ్మవారి విగ్రహం పడుకొన్నట్లుగా (అలియార్ నదికి సమాంతరంగా) ఉంటుంది. రాముడు సేతాన్వేషణ సమయంలో ఇక్కడికి రావడం మరియు ఇక్కడ కొద్ది రోజులు ధ్యానం చేసినట్టుగా ఇక్కడి వారి నమ్మకం.
ఈ గుడికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉన్నది. పూర్వం ఈ ప్రాంతాన్ని నానన్ అనే రాజు పరిపాలించేవాడు. అలియార్ నది ఒడ్డున పంటపొలాల దగ్గర ఒక ప్రత్యేకమైన మామిడి చెట్టు కలదు. ఆ మామిడి చెట్టన్నా, దాని పండ్లన్నా రాజు గారికి చాలా ఇష్టం. రాజు గారి ఆజ్ఞ ప్రకారం ఆ చెట్టు ఆకులను కానీ, పండ్లను కానీ ఎవరు ఉపయోగించడానికి వీల్లేదు. ఒక రోజు కొంత మంది అమ్మాయిలు నది ఒడ్డున స్నానం చేస్తూ నీటిలో తేలియాడుతున్న మామిడిపండును చూసారు. అది రాజు గారి చెట్టుకు సంబంధించిన మామిడి పండు. అందులో ఒక అమ్మాయి ఆ మామిడి పండును తిన్నది. ఇది రాజు గారికి తెలిసి ఆ అమ్మాయికి మరణ దండన విధించాడు. కొద్ది రోజుల తర్వాత అక్కడ నివసించేవారు పడుకొని ఉన్న ఒక అమ్మాయి విగ్రహాన్ని తయారు చేయించి , ఆ అమ్మాయికి గుర్తుగా పూజించడం ప్రారంభించారు. తరవాత కాల క్రమంలో ఆమె మాసానిగా ప్రసిద్ధి చెందిది. కొద్ది రోజుల తర్వాత కోరిన్ ఖోసర్గల్ అనే రాజు నానన్ ని ఓడించి, ఆ చెట్టును ధ్వంసం చేసాడు. చూడవలసినవి: మాసాని అమ్మన్ తిరుకోయిల్ , అలియార్ నది వసతి : కోయంబత్తూర్ మరియు పొల్లాచి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, తంజావూరులో కలదు. ఇందులో ఎంతో పురాతన కాలంనాటి తాళపత్ర గ్రంథాలున్నాయి. పురాతన కాలం నాటి ఆయుధాలు , కిరీటాలు , కృపాణాలు లాంటివి ఎన్నో భద్రం చేయబడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యిదో విజ్ఞాన భాండాగారం. సంస్కృత గ్రంథాలు అనేకం గల ఇక్కడి సంగీత మహల్లో రాతి స్తంభాలు సరిగమ పదనిసలు తాకగానే వినిపిస్తాయి. 30 వేల వ్రాత ప్రతులు గల ఈ సరస్వతి మహల్ గ్రంథాలయంలో భారతీయ, యూరోపియన్ల భాషలకు సంబంధించిన ఆముద్రిత గ్రంథాలు వున్నాయి.
చూడవలసినవి: సరస్వతి మహల్, తంజావూర్ ప్యాలెస్ మ్యూజియం వసతి : తంజావూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : తంజావూర్ లో లోకల్ బస్సులు కలవు. సంధ్యా సమయంలో మలి సంధ్య వెలుగులో గంగమ్మ తల్లికి ఇచ్చే హారతిని దర్శించుటకు భక్తులు ఆ సమయానికి అసంఖ్యాకంగా వచ్చి చేరుతారు. హరి-కి పైరీ ఘాట్ వద్ద నున్న ఆలయంలోనే కాక వరుసగా నది ఒడ్డున బారుతీరి ఉన్న దేవాలయములు, హరిద్వార్ లో ఉన్న ప్రతి దేవాలయం వారు ఇదే సమయానికి హారతిని ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతి ఉదయం, సాయంత్రం ఇచ్చే గంగా హారతి జీవుల యొక్క మానసిక, ఆత్మశక్తులను ఉద్దరిస్తుందని, మరియు దినారంభానికి ఈ హారతి అత్యంత శుభశూచకమని భక్తుల విశ్వాసం. ఇక మలిసంధ్య సమయంలో జరిగే మహాహారతి తల్లికి కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వబడుతుందని చెబుతారు.
హరిద్వార్ యొక్క పవిత్రతను సంధ్యాసమయములలో ఇచ్చే హారతి మరింత ఇనుమడింప చేస్తుంది. ఆ సమయంలో భక్తులు చేసే ప్రార్థనలతో, హారతి ఇస్తూ, పూజారులు చేసే ఘంటరావాలతో ఆ ప్రాంగణం ఒక వింతైన, భక్తిపారవశ్యమైన స్థితిలో ఉండి భక్తుల ఒడలను గగర్పోడుస్తుంటుంది. 'ఈ మహాహారతిని' దర్శించే దృశ్యం వర్ణనాతీతంగా, అపూర్వమైన ఆధ్యాత్మిక సన్నివేశాలుగా వివరణ చేయవచ్చు. ఆధ్యాత్మిక పారవశ్యానికి, ఆత్మప్రక్షాళనను, భగవంతుని కటాక్షాన్ని భక్తునిపై ప్రసరింపచేసే ఈ అద్భుతమైన, 'మహాహారతిని ' ప్రతి భక్తుడు వీక్షించి ధన్యుడవవలసిందే. భక్తులు పూలసజ్జలో జ్యోతిని వెలిగించి సజ్జను గంగానది నీటిపై వదులుతారు. వేలమంది భక్తులు నిర్వహించే ఈ దృశ్యం స్వయంగా నక్షత్రాలే సామూహికంగా తరలివచ్చి గంగమ్మ తల్లి కాలికి నమస్కరించుతున్నాయా అన్నట్లుగా ఆ ప్రదేశం మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. చూడవలసినవి: దక్ష ప్రజాపతి ఆలయం, గంగా మాత ఆలయం, మానసా దేవి ఆలయం వసతి : హరిద్వార్ లో చాలా హోటల్స్ మరియు సత్రాలు కూడా కలవు. అందుబాటు : రైల్వే స్టేషన్ నుండి ఆటోలు మరియు రిక్షాలు లభించును. ఇది ఉత్తరాఖండ్, హరిద్వార్ జిల్లాలో కలదు. హరిద్వార్ కి 4 కి. మీ దూరంలో ఉన్న కన్ ఖాల్ ప్రదేశంలో శివాలిక్ పర్వత శ్రేణిలోని బిల్వ పర్వత శిఖరాన నెలకొని ఉన్నది ఈ మానసాదేవి అమ్మవారి ఆలయం. పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహిస్తూ అల్లుడయిన పరమేశ్వరుడిని ఆహ్వానించుట జరగలేదు. సతీదేవి తండ్రి చేసిన అవమానానికి తట్టుకొనలేక ఆగ్రహావేశములతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకున్నది. అంతట శంకరుని శిష్యులు రౌద్రులై దక్షుడిని హతమార్చారు. అయితే పరమదయాళువు అయిన ముక్కంటి దక్షుడిని పునరుజ్జీవింప చేసిన చోటు. సతీదేవి ఆత్మాహుతి స్మారకంగా ఈ ఆలయం నిర్మించబడినది. నాగరాజు వాసుకి సతీమణి అయిన మానసాదేవికి ఈ ఆలయం అంకితమైనది. "మానస" అనగా "కోరిక". కోరికలు తీర్చే దేవతగా మానసాదేవి ప్రసిద్ధి చెంది ఉన్నది.
ఇంకా ఈ ఆలయం సమీపంలో అతి పురాతనమైన వృక్షములకు తోరాలు కట్టి తమ కోర్కెలు తీర్చమని దేవిని భక్తులు వేడుకుంటారు. భక్తులు ఈ ఆలయాన్ని నడక ద్వారా లేదా రోప్ వే ద్వారా చేరుకోవచ్చు. చూడవలసినవి: దక్ష ప్రజాపతి ఆలయం, గంగా మాత ఆలయం, మానసా దేవి ఆలయం వసతి : హరిద్వార్ లో చాలా హోటల్స్ మరియు సత్రాలు కూడా కలవు. అందుబాటు : రైల్వే స్టేషన్ నుండి ఆటోలు మరియు రిక్షాలు లభించును. ఇది ఉత్తరాఖండ్, హరిద్వార్ జిల్లాలో కలదు. చాలా పురాతనమైన ఈ కన్ ఖాల్ హరిద్వార్ పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి 4 కి. మీ దూరంలో కలదు. దక్ష ప్రజాపతి ఆలయం, సతీ కుండంతో పాటు మహా వీరాంజనేయ ఆలయం ఉంది. స్థలమహత్యం ప్రకారం ..... దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని తలపెట్టి అందరినీ పిలిచి, తనని వ్యతిరేకించి వెళ్ళిన కూతురు సతీదేవిని, అల్లుడు శివుడ్ని పిలువకుండా యజ్ఞాన్ని ప్రారంభించాడు. పుట్టింటి మీద మమకారంతో శివుడు వద్దంటున్నా వెళ్ళిన సతీదేవికి భంగపాటే జరిగింది. తండ్రి ఆగ్రహించి అల్లుడయిన శివుడ్ని ఘోరంగా దూషించాడు. అది విని భరించలేక యజ్ఞ కుండం లోకి దూకింది సతీదేవి. అది తెలిసిన శివుడు కాలరుద్రుడై యజ్ఞాన్ని ధ్వంసం చేసి మృతురాలైన సతీదేవి దేహాన్ని తీసుకొని శోకతప్త- హృదయుడై తిరగడంతో లోకాలు అల్లకల్లోలమయ్యాయి. ఆ ప్రళయాన్ని ఆపే ఉద్దేశ్యముతో శ్రీ మహా విష్ణువు చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అప్పుడు సతీదేవి దేహం 52 శకలాలుగా చేధించబడినది. ఈ ఆలయ ప్రాంగణంలో సతీదేవి మృతదేహాన్ని మోసుకొని వెళ్తున్న శంకరుని విగ్రహం భక్తులని అమితంగా ఆకర్షిస్తుంది.
చూడవలసినవి: దక్ష ప్రజాపతి ఆలయం, గంగా మాత ఆలయం, మానసా దేవి ఆలయం వసతి : హరిద్వార్ లో చాలా హోటల్స్ మరియు సత్రాలు కూడా కలవు. అందుబాటు : రైల్వే స్టేషన్ నుండి ఆటోలు మరియు రిక్షాలు లభించును. ఇది తమిళనాడు, కోయంబత్తూర్ జిల్లాలో, కోయంబత్తూర్ పట్టణం నుండి 20 కి.మీ దూరంలో కలదు. ఇక్కడ ఉన్న సుబ్రమణ్యస్వామి కొండ మీద కొలువై ఉన్నాడు. ఇది మరుదమలై కొండకు ఇంకో వైపు ఉన్నది. ఇక్కడ దర్శనం వేళలు ఉదయం 8 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ ఉదయం మరియు సాయంత్రం వేళలో ఏనుగులు తిరుగుతుంటాయి. చాలా మంది భక్తులు వారాంతాలలో మరియు పర్వదినాలలో ఈ గుడిని దర్శించుకుంటారు.
చూడవలసినవి: సుబ్రమణ్యస్వామి టెంపుల్ వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూర్ నుండి బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/anuvavi.html |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|