చూడవలసినవి: వినాయకర్ టెంపుల్
వసతి : పొల్లాచ్చిలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : పొల్లాచ్చి నుండి బస్సు సౌకర్యం కలదు.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/prasanda-vinayagar-temple.html
ఇది తమిళనాడు, కోయంబత్తూర్ జిల్లాలో కలదు. ఇది అలియార్ నది ఒడ్డున , పొల్లాచ్చికి 8 కి. మీ దూరంలో కలదు. ఈ మధ్యనే ఈ గుడిని పునరుద్ధరించి 2007 లో కుంభాబిషేకం జరిపించారు. ఇది మొదటగా శివుడి కోసం నిర్మించారట కాని ఎందువల్ల దీనిని వినాయకుని గుడిగా మార్చారో ఎవరికీ తెలియని విషయం. ఇక్కడున్న వినాయకుని విగ్రహం 500 సంవత్సరాల క్రితం నాటిది. ఈ గుడి ముందున్న నంది విగ్రహం 1000 సంవత్సరాల క్రితం నాటిదని ఇక్కడి వారు చెబుతారు.
చూడవలసినవి: వినాయకర్ టెంపుల్ వసతి : పొల్లాచ్చిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పొల్లాచ్చి నుండి బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/prasanda-vinayagar-temple.html
0 Comments
ఇది తమిళనాడు, కోయంబత్తూర్ పట్టణానికి 72 కి.మీ (కోయంబత్తూర్ -కార్మడై -పిల్లూర్ డ్యాం రోడ్ -బార్లికడు ) దూరంలో కలదు. బార్లికడు పిల్లూర్ డ్యాంకి దగ్గరలో కలదు. ఇక్కడ దోనె లో విహారం ప్రత్యేకం. ఇక్కడకి చేరుకోవడానికి అడవి గుండా ప్రయాణించాలి. కాబట్టి ఆటవీశాక అధికారుల అనుమతి తప్పనిసరి. బార్లికడు వెళ్ళే దారిలో కెమ్మరంపాలయం దాటిన తరవాత రెండు చెక్ పోస్ట్ లు కలవు. మొదటి చెక్ పోస్ట్ లో అనుమతిని పొందడం కొంచెం తేలికే. రెండవ చెక్ పోస్ట్ ని దాటాలంటే మాత్రం ముందస్తు అనుమతి తప్పనిసరి. ప్రయాణం మొత్తం అడవిగుండా కావడం చేత చాలా మలుపులు కలవు. ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎలాంటి తినుభండారాలు లభించవు. మీవెంట వాటిని తీసుకెళ్లడం మరచిపోకండి.
చూడవలసినవి: పిల్లూర్ డ్యాం, బార్లికడు వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూర్ నుండి ఊటీ వెళ్ళే బస్సు (కీల్ కుందా) మాత్రమే ఈ అడవిగుండా పోతుంది. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/barlikadu.html ఇది తమిళనాడు, కోయంబత్తూర్ పట్టణానికి పశ్చిమాన 7 కి.మీ దూరంలో కలదు. దీనినే మేల్ చిదంబరం అని కూడా అంటారు. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. ఇక్కడి శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారిని జనన మరణ కాల చక్రం నుండి శివుడు విముక్తి కలిగిస్తాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ ఆలయం నొయ్యల్ నదికి దగ్గరలో కలదు. ఈ ఆలయాన్ని కరికాల చోరన్ అనే రాజు నిర్మించాడు. ఈ ఆలయానికి ముందర ఒక చిన్న కొలను లాంటిది కలదు. దానిని తెప్పకులం అని పిలుస్తారు. ఈ తెప్పకులం 16 కోణాలు మరియు 8 మూలలతో ఉంది. ఇది 15 వ శతాబ్దంలో, విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడినది.
చూడవలసినవి: పెరూర్ పట్టీశ్వరర్ ఆలయం, ఎచనారి వినాయగర్ ఆలయం వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూర్ నుండి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/perur.html ఇది తమిళనాడు, క్రిష్ణగిరి జిల్లాలో కలదు. ఇది హొసూరు నుండి 10 కి.మీ దూరంలో ఒన్నల్ వాడికి సమీపంలో, తోరపల్లి గ్రామంలో కలదు. ఇది చక్రవర్తి రాజాజీ పుట్టిన ఇల్లు. రాజాజీ అంటే రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. రాజాజీ గారు వకీలుగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, రాజకీయనాయకుడిగా, రచయితగా మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు కూడా పనిచేసారు. మద్రాస్ ప్రెసిడెన్సీకి మఖ్యమంత్రిగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్ గా కూడా పనిచేసారు. రాజాజీ గారు స్వాతంత్ర పార్టీ అనే దానిని స్థాపించారు. భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అందుకున్నవారిలో ప్రథముడు. రాజాజీగారు పుట్టిన ఇల్లును తమిళనాడు ప్రభుత్వంవారు రాజాజీ మెమోరియల్ గా మార్చారు. ఇందులో రాజాజీ గారి జీవత కాలంలో వివిధ ఘట్టాలను తెలిపే ఫోటోలు ఉన్నాయి. ఈ ఇంటిలో రాజాజీ గారు ఉపయోగించిన కొన్ని వస్తువులను మనం చూడొచ్చు.
చూడవలసినవి: రాజాజీ మెమోరియల్ వసతి : హొసూరు లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : హొసూరు నుండి ఒన్నల్ వాడికి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/thorapalli.html ఇది తమిళనాడు, ధర్మపురి జిల్లాలో కలదు. ఇది భౌగోళికంగా తమిళనాడులో ఉంది కాని బెంగళూరు నుండి వెళ్ళడం సులభం. ఇది ధర్మపురి నుండి 50 కి. మీ, సేలం నుండి 114 కి. మీ, బెంగళూరు నుండి 133 కి. మీ దూరంలో కలదు. ఇది నిజానికి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో ఉంది.
ఆకాశం నుండి దూకుతున్నట్లుండే ఈ జలపాతం, చూపరులకు కళ్ళు చేదిరనట్లనిపించడం దీని ప్రత్యేకత. ఆధునిక ప్రపంచానికి సుదూరంగా ఉండే ఈ ప్రదేశం సహజత్వానికి చేరువగా ఉంది. పర్యాటకులకు అమితానందాన్నిచ్చే అనుభూతుల నిలయం. హోగెనక్కల్ కు హైవే నుండి నాలుగు కిలోమీటర్లు లోపలకు వెళ్ళాలి. దాదాపుగా దగ్గరకు వెళ్ళేవరకు ఆనవాలు కూడా కనిపించదు. జలపాతానికి కిలోమీటర్ దూరంనుండే ఝుమ్మనే శబ్ధం వినిపిస్తుంది. ఆ శబ్ధం ఎత్తు నుండి జాలువారుతున్న నీటి సందడే. ముందుకెళ్ళే కొద్దీ శబ్ధం ఎక్కువవుతుంది. అప్పుడే మన మనోఫలకం మీద ఒక రూపం లీలగా రూపుదిద్దుకుంటుంది. తీరా దగ్గరికి వెళ్తే ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. మనమేదో భ్రాంతిలో ఉన్నామా? శబ్ధంతాలూకు ట్రాన్స్ లో ఒక రూపాన్ని ఊహించుకుంటున్నామా? నిజంగా జలపాతాన్ని చూస్తున్నామా? అని గిల్లుకొని చూడాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒకటి, రెండు కాదు, లెక్కపెట్టలేనన్ని జలపాతాలు ఉన్నాయి. 250 మీటర్ల ఎత్తు నుండి భూమి మీదకు దూకుతున్నాయి. వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి హోగెనక్కల్ దగ్గర నదిలో కలుస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ నీరు కావేరి డ్యాం బ్యాక్ వాటర్స్. అంతెత్తు నుండి కిందకు దూకే క్రమంలో నీటి తుంపరలు 20 మీటర్ల ఎత్తు లేస్తాయి. ఈ తుంపరలన్నీ కలిసి పొగ కప్పేసినట్టు ఉంటుంది. హోగెనక్కల్ అంటే అర్థం కూడా ఇదే. మంచు తుంపరల నుండి వచ్చే శబ్ధం అని. ఇక్కడ ఉన్న రెండు కొండలను చూస్తే ఒక కొండ మధ్యకు నిలువునా చీలినట్లు ఉంటుంది. ఆ చీలికలోనే ప్రవాహం. ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం సాహసమే. హోగేనక్కల్ ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయంటారు. ఈ ప్రదేశం మసాజ్ కు ప్రసిద్ధి. ఆయుర్వేద తైలాలతో మర్దన చేస్తారు. ఇక్కడి వాళ్లకు ఇది కుటీర పరిశ్రమ. హోగెనక్కల్ ట్రిప్ లో మర్చిపోకుండా రుచి చూడాల్సింది ఒకటుంది. నదిలో చేపలు పట్టి అక్కడే కాల్చి ఇస్తారు. ఆ రుచి మరెక్కడి చేపకూ రాదు. అరుదైన ప్రకృతి సోయగాలను సొంతం చేసుకున్న ఈ ప్రదేశంలో ఎంత సేపున్నా ఇంకా ఉండాలనే అనిపిస్తూ ఉంటుంది. ఇది తమిళనాడు, కోయంబత్తూర్ పట్టణం నుండి 15 కి. మీ దూరంలో కలదు. ఇక్కడి ప్రధాన దైవం సుబ్రమణ్యస్వామి. మరుదమలై చేరుకున్నాక కొండ పైకి వెళ్ళడానికి రెండు మార్గాలు కలవు. ఒకటి రోడ్డు మార్గం మరియు రెండవది మెట్ల ద్వారా. మెట్ల ద్వారా వెళ్లాలనుకునే భక్తులు సుమారుగా 600 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. తమిళంలో మరుద అనేది చెట్టు మరియు మలై అంటే కొండ . ఇక్కడ ఉన్న కొండ ఎక్కువగా మరుద చెట్లతో ఉండడంవల్ల దీనికి మరుదమలై అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉండే సుబ్రమణ్యస్వామికి మరుదజలాపతి అనే పేరు కలదు. ఇక్కడ చూడవలసినది మరొకటి కూడా కలదు. అదే పామ్ బట్టి సిద్ధార్ గుహ. ఇది మరుదమలై గుడికి ఆగ్నేయ దిశగా కొంచెం కిందికి వెళితే వస్తుంది. ఈ గుహలోనే ఒక పాము సుబ్రమణ్యస్వామిని పూజిస్తూ, ధ్యానం చేస్తూ సిద్ధిని పొందిందని ఇక్కడి వారి విశ్వాసం. ఇక్కడ ఉన్న ఒక రాతి మీద పాము ఆకారం మనం చూడవచ్చు.
చూడవలసినవి: మరుదమలై గుడి, పామ్ బట్టి సిద్ధార్ గుహ వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/maruthamalai-temple.html ఇది కోయంబత్తూర్ నుండి 30 కి మీ దూరంలో కలదు. ఈ ధ్యాన లింగం ప్రవేశించడానికి ముందే మన దగ్గర ఉన్న మొబైల్స్, కెమెరాస్ అన్నీ డిపాజిట్ చేయించుకుంటారు. బాగ్స్ మాత్రం లోపలికి తీసుకొని పోవచ్చు. మన వస్తువులు డిపాజిట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే కుడి చేయి వైపు ఒక పెద్ద సూర్య గుండం ఉంటుంది. ఆ గుండం లోపల మూడు శివ లింగాలు ఉన్నాయి. ఆ గుండంలో వాటర్ ఫాల్ లాంటిది ఏర్పాటు చేసారు అందులో స్నానం చేసి ఆ మూడు లింగాలను దర్శించుకోవచ్చు. స్నానం చేయడానికి భక్తులకు కాషాయం వస్త్రాలు కూడా ఇస్తారు. ఇది మగవాళ్ళకు మాత్రమే. ఆడవాళ్లకు కూడా లోపల చంద్ర గుండం కలదు. ఈ సూర్య గుండం ఒడ్డున ఒక స్తంభానికి నాగ పడగ చెక్కి ఉంది. ఇక్కడికి అందరూ వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. సూర్య కుండంలో నుండి బయటకి వచ్చాక ఇంకా కొంచెం ముందుకు వెళితే మనకు ముందుగా ఒక కొలనులాంటిది కనిపిస్తుంది అందులో తామర పూలు, ఆరెంజ్ కలర్ చేపలు చాలా చూడముచ్చటగా అనిపించాయి. కొలనుకు దగ్గరలో ఒక చిన్న పాటి నర్సరీ కూడా కలదు. అక్కడినుండి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు లింగ భైరవి గుడి కనిపిస్తుంది. ఆ గుడి లోపల మధ్యలో ఒక త్రిశూలం ఉంది దానికి అన్నీ పసుపు కొమ్ములు కట్టబడి ఉన్నాయి. ఆ గుడికి ఎదురుగా ఒక పెద్ద బండ రాయి మీద మూడు శివునికి యొక్క ఆకారాలు చెక్కబడి ఉన్నాయి. మొదటి శివుని ఆకారం పూర్తిగా కళ్ళు మూసుకొని, నుదుటి మీద సగం చంద్రుని ప్రతిమ కలిగి ఉంది, అంటే శివుడు ధ్యానం చేస్తూ,చాలా శాంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది . రెండవ శివుని ఆకారం సగం కళ్ళు తెరుచుకొని, నుదుటి మీద త్రినేత్రం కలిగి ఉంది అంటే మాములుగా శివుడి రూపాన్నీ తలపిస్తుంది. మూడవ శివుని ఆకారం పూర్తిగా కళ్ళు తెరుచుకొని, నుదుటి మీద సూర్యుడి ప్రతిమ ఉంది అంటే శివుడు ఆగ్రహంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఇంకొంచెం లోపలి వెళ్తే అక్కడ వెదురుతో చేయబడిన ఒక చిన్న గుడిసెలో ఓంకార్ గుడి కనిపిస్తుంది. అది తెరిఛి ఉండబడే సమయం 12.30 pm - 1.30 pm మాత్రమే. ఇంకా కొంచెం లోపలి వెళ్తే చంద్ర గుండం కనిపిస్తుంది అదే ముందుగా చెప్పినట్టు ఆడవాళ్ళ కోసం కట్టిన గుండం. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ద్యానలింగం. ధ్యాన లింగానికి వెళ్ళడానికి ముందుగా మరొక చెక్ పాయింట్ . ఇక్కడ మనతో పాటు తెచ్చుకున్న బాగ్స్ ని కూడా డిపాజిట్ చేయాలి.ఇక్కడి నుండి మహిళలను వాళ్ళ కాళ్ళకు పట్టీలు ఉంటె అనుమతించరు. వాటిని కూడా తీసివేయాలి.(లోపలికి వెళ్ళాక ధ్యానం చేసుకునే వాళ్లకు మహిళల కాళ్ళకు ఉండే పట్టీల వల్ల వచ్చే శబ్దం వల్ల ధ్యాన భంగమవుతుందని). అక్కడ నుండి ధ్యాన లింగలోకి ప్రవేశించగానే, అక్కడే వరండాలో ఉన్న సహాయకులు ఎవరిని కూడా మాట్లాడ వద్దనీ, అక్కడ కూర్చోమని సైగలతో చెప్తున్నారు. అక్కడ కొద్ది నిముషాలు కూర్చున్నాక లోపలికి పంపిస్తారు.(ప్రధాన ధ్యాన లింగంలో కూర్చున్న వాళ్ళు బయటికి వచ్చాక వరండాలో కూర్చున్న వాళ్ళని లోనికి అనుమతిస్తారు.) లోపల డోము ఆకారంలో చాలా పెద్దగా ఉంటుంది. అందులో మధ్యలో పెద్ద శివ లింగం, దానికి ఎదురుగా ధ్యానలింగం బయట ఒక నంది విగ్రహం కలదు. శివ లింగం చుట్టూ కూర్చొని ధ్యానం చేసుకోవడానికి వీలుగా 28 చిన్న చిన్న గుహలు ఉన్నాయి. కొద్ది సేపు ధ్యానం చేసిన తరవాత ఒక చిన్న ఘంట మోగుతుంది (వినపడీ వినపడనట్టుగా). అప్పుడు లోపల ఉన్నవాళ్ళు బయటికి వెళ్తారు. వరండాలో కూర్చున్న వాళ్ళు లోపలి వస్తారు. లోపలికి కేమెరాలు అనుమతించరు అని చెప్పారు కదా మరి ఫోటోలు ఎలా తీసారంటారా ! అంతర్జాలం ఉంది కదండీ!!!!!
ఈ ఆలయం కోయంబత్తూర్ నుండి పొల్లాచ్చికి వెళ్ళే మార్గంలో, 13 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న వినాయకుణ్ణి ఎచనారి వినాయకర్ అంటారు. తమిళనాడులోని అన్ని వినాయకుని గుడులల్లోకెల్లా దీనిని ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ గుడిలోని వినాయకుడి విగ్రహం 6 అడుగుల ఎత్తు మరియు 3 అడుగుల వెడల్పుతో ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన వినాయకుడి విగ్రహాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆలయానికి క్రీ శ 1500 నాటి ఒక చరిత్ర ఉంది. నిజానికి ఇక్కడ ఉన్న మూల విరాట్ ఈ ఆలయం కోసం తయారు చేయబడింది కాదు. పేరూర్ లోని పట్టీశ్వరర్ ఆలయం కోసం (ఇది కూడా కోయంబత్తూరు లోనే కలదు) తయారుచేయబడింది. మధురై నుండి పేరూర్ వెళ్ళే క్రమంలో ఈ విగ్రహం ఎచనారిలో వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. అప్పటినుండి ఈ వినాయకుడి విగ్రహం ఎచనారిలోనే పూజలు అందుకుంటూ ఎచనారి వినాయకర్ అయ్యాడు.
చూడవలసినవి: ఎచనారి ఆలయం వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/eachanari-temple.html హరిత నగరం కోయంబత్తూర్ లోని రేస్ కోర్స్ రోడ్డు రేసులకు నిలయం కాదు. జనావాసం, పెద్ద పెద్ద భవంతులతో పాటు , పలు చారిత్రాత్మక కట్టడాల తాలూకు మీనియేచర్లు ఈ రోడ్డులోని ప్రధానమైన ఆకర్షణ. ప్రతి రొజూ ప్రాతః సంధ్యాకాలాల్లో ఈ విశాలమైన రోడ్డు పాదచారుల స్వర్గంగా మారిపోతుంటుంది. రేస్ కోర్స్ రోడ్డు లోని పచ్చని చెట్లు స్వచ్ఛమైన ఆమ్లజనిని అందిస్తుండటం వల్ల కోవై కార్పోరేషన్ సైతం దీనిపైన అత్యంత శ్రద్ధ కనబరుస్తూ దీన్ని యాత్రా సందర్శక స్థలంగా పర్యాటకుల స్వర్గధామంగా మార్చింది.
ప్రపంచాన్ని చూసినట్లే కోవై నగరవాసులకు ఒక విచిత్రమైన నమ్మకం ఉంది. అదేమంటే ఏ రోజైతే కోవై పూర్తి కట్టడాలతో మారిపోతుందో.. అప్పుడు శ్రీకృష్ణుడు తిరిగి జన్మించి అలాంటి నిర్మాణాలు చేసిన వారిని శిక్షిస్తాడని, ఈ నమ్మకం ఉండబట్టే ఇంకా కోవై పచ్చని చెట్లతో అలరారుతోందని వారి విశ్వాసం. సరే ఇక ఈ రోడ్డుకు వస్తే ప్రపంచాన్ని ఎలా చూసినట్లు అవుతుందో చెప్పుకుందాం. వాకర్లు నడిచే కుడి-ఎడమ వైపు పెంచిన పచ్చిక బయళ్ళలో ప్రపంచంలోని అతి సుప్రసిద్దమైన భవంతుల నమూనాలను ఇక్కడ ఏర్పాటు చేసారు. ఎర్రకోట (రెడ్ ఫోర్ట్ ), సెల్యూలర్ జైలు, బహాయి టెంపుల్, ఒక పక్కకు ఒరిగి ఉన్న పీసా గోపురం,హవా మహల్ , ఈఫిల్ టవర్, రాష్ట్రపతి భవనం ఇలా అనేక ప్రముఖ కట్టడాల నమూనాలు ఈ పచ్చిక బయళ్ళలో అందంగా అలంకరించారు. వీటిని చూస్తుంటే ఆయా దేశాలకు వెళ్లి వాటి ముందు నిల్చొని చూస్తున్న భావన కల్గేలా వీటిని నిర్మించారు. కోవై వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ రేస్ కోర్స్ రోడ్ లో ఒకసారి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా తిరిగి చూడాల్సిందే. అంతటి సౌందర్యం కోయంబత్తూర్ లోని ఈ రోడ్డుకు మాత్రమే సొంతం. బెతెస్డ ( అంతర్జాతీయ ప్రార్ధనా మందిరం), ఇది తమిళనాడు కోయంబత్తూరు లో కలదు. ఇది కోయంబత్తూరు పట్టణం నుండి 25 కి. మీ దూరంలో , కోవై కుట్రాలంకు వెళ్ళే దారిలో కారుణ్య నగర్ లో కలదు. ఇక్కడికి భక్తులు వివిధ రకాల ప్రార్ధనలు చేయడానికి వస్తారు. ఈ చర్చి లో వివిధ ప్రత్యెక ప్రార్ధనా మందిరాలు కలవు. ఆరుబయట అక్కడక్కడ ప్రార్ధనలు చేసుకోవడానికి చిన్న చిన్న గోపురాలాను నిర్మించారు. ఏసు క్రీస్తు జీవిత గాథను తెలిపే 7 నిర్మాణాలు మనల్ని అలరిస్తాయి. ఇక్కడ ఉండటానికి వసతి సౌకర్యం కూడా కలదు.
చూడవలసినవి: చర్చి , కోవై కుట్రాలం వసతి : ఇక్కడనే వసతి కలదు. అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/bethesda.html |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|