చూడవలసినవి: ఎచనారి ఆలయం
వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు .
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/eachanari-temple.html
ఈ ఆలయం కోయంబత్తూర్ నుండి పొల్లాచ్చికి వెళ్ళే మార్గంలో, 13 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న వినాయకుణ్ణి ఎచనారి వినాయకర్ అంటారు. తమిళనాడులోని అన్ని వినాయకుని గుడులల్లోకెల్లా దీనిని ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ గుడిలోని వినాయకుడి విగ్రహం 6 అడుగుల ఎత్తు మరియు 3 అడుగుల వెడల్పుతో ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన వినాయకుడి విగ్రహాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆలయానికి క్రీ శ 1500 నాటి ఒక చరిత్ర ఉంది. నిజానికి ఇక్కడ ఉన్న మూల విరాట్ ఈ ఆలయం కోసం తయారు చేయబడింది కాదు. పేరూర్ లోని పట్టీశ్వరర్ ఆలయం కోసం (ఇది కూడా కోయంబత్తూరు లోనే కలదు) తయారుచేయబడింది. మధురై నుండి పేరూర్ వెళ్ళే క్రమంలో ఈ విగ్రహం ఎచనారిలో వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. అప్పటినుండి ఈ వినాయకుడి విగ్రహం ఎచనారిలోనే పూజలు అందుకుంటూ ఎచనారి వినాయకర్ అయ్యాడు.
చూడవలసినవి: ఎచనారి ఆలయం వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/eachanari-temple.html
0 Comments
జైనిమేడు
పాలక్కడ్ కోట చూసిన తరవాత జైనిమేడుకు బయలుదేరాం. ఇది రైల్వే స్టేషన్ కి దగ్గరలోనే కలదు. ఇక్కడ దిగంబర జైన్ మందిర్ కలదు. ఈ గుడి చుట్టు ప్రక్కల ప్రదేశాన్ని అంతటినీ కలిపి జైనిమేడు అంటారు. జైన్ మందిర్ వెళ్ళడానికి ముందు నేను కొంచెం ఎక్కువగా ఊహించుకున్ననేమో , జైనిమేడు కు వెళ్ళాక కొంచెం నిరుత్సాహపడ్డాను ఎందుకంటే మామూలుగా జైన్ దేవాలయాలు చాలా మటుకు గొప్ప శిల్ప కళా చాతుర్యాన్ని కలిగి ఉంటాయి. కాని ఇక్కడ జైన్ మందిర్ మామూలుగా ఉంది. మేము వెళ్ళేసరికే జైన్ మందిర్ మూసివేయబడింది. ఇంకా అక్కడినుండి మలంపురా డ్యాం మరియు గార్డెన్ కి బయలుదేరాం. ధర్మ లింగేశ్వర స్వామి కోయిల్ , మదుక్కరై ఒక విధంగా చెప్పాలంటే కోయంబత్తూర్ నుండి కేరళ బార్డర్ పెద్ద దూరమేమి కాదు. కోయంబత్తూర్ నుండి ఒక ముప్పయి కిలోమీటర్లు ప్రయాణిస్తే కేరళ సరిహద్దు చేరుకోవచ్చు. శనివారం ఉదయం 7 గంటలకు ద్విచక్ర వాహనం మీద బయలుదేరాము. మేము బయలుదేరేటప్పుడు కోయంబత్తూర్ లో ఎండగా ఉంది. సిటి అవతలకి చేరగానే వాతావరణం మేఘావృతమై కనిపించింది. బండి మీద వెళుతుంటే మబ్బులు కూడా వాటి దారిలో అవి ప్రయాణిస్తున్నాయి. బండి ఒకసారి ఆపి వాటిని అలాగే చూస్తూ ఉండి పోయాము. ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. చిన్నప్పుడు మబ్బులు అలా వెళుతుంటే బయట నిలిబడి చూస్తూ ఉండేవాళ్ళము. అప్పుడు భలే సరదాగా అనిపించేది. అక్కడి నుండి బయలుదేరి ముందుగా మధుక్కరై చేరుకున్నాము. అక్కడ ఒక పెద్ద కొండ కనిపించింది. ఆ కొండ మధ్య భాగం నుండి పై భాగం వరకు మబ్బుల్లో ఉన్నట్లుగా అనిపించింది. చిన్నప్పటి నుండి కింది నుండి మబ్బులను చూడడమే కాని మనల్ని మబ్బులు అలా తాకుతూ వెళుతూ ఉంటే ఎలా ఉంటుందో అనిపించింది. ఒక్కసారిగా అలాంటి అనుభూతి పొందాలని అనిపించింది. మళ్ళి అవకాశం వస్తుందో రాదో అని కొండ ఎక్కుదామని నిర్ణయించుకున్నాము. అక్కడికి వెళుతుంటే తెలిసిందేమిటి అంటే కొండ పైన శివుడి గుడి ఉందని. ఇక్కడి వాళ్ళు దానిని ధర్మలింగేశ్వర స్వామి కోయిల్ అంటారు. కొండ పైకి బండి వెళ్ళడానికి మార్గం లేకపోవడంతో, బండి కిందనే పార్క్ చేసి మెట్లు ఎక్కడం ప్రారంబించాము. మెట్లు ఎక్కుతుంటే కొంచెం పైన మబ్బులు అలా ఆ కొండని తాకుతూ వెళ్ళిపోతున్నాయి. కొన్ని నిమిషాల్లో మేము కూడా ఆ మబ్బుల్లో ఉంటామన్న ఆనందం మెట్లు ఎక్కడం వల్ల వచ్చే అలసటను మరిచిపోయేలా చేసింది. కొండ కింది నుండి చూసినప్పుడు కొండ మధ్య నుండి పై వరకూ మబ్బులు ఉన్నాయి కానీ కొండ మధ్యకి చేరుకున్నాక మబ్బులు మరీ పలుచగా ఉన్నాయేమో మాకు చల్లగా అనిపించింది కానీ మబ్బులు కనిపించలేదు. ఇంకొంచెం పైన మబ్బులు కనిపించాయి. మబ్బుల్ని ఎలాగానే తాకాలన్న ఉద్దేశముతో రెట్టించిన ఉత్సాహముతో కొండ పైవరకూ చేరుకున్నాము. మేము ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. మబ్బులు అలా మమ్మల్ని తగులుతుంటే ఏదో ఒక కొత్త అనుభూతికి లోనయ్యాము. పైన పెద్దగా భక్తులు లేరు. కొండ పైనుంచి కిందకి చూస్తే ఏమి కనిపించట్లేదు ఒక మబ్బులు తప్ప. అక్కడ ఉన్న ఆ చలి, ఆ గాలి అంతా కలిసి నన్ను మైమరచిపోయేలా చేసాయి. ఏదో ఒక కొత్త లోకంలో విహరిస్తున్నట్లు అనిపించింది. అలాగే కొద్దిసేపు అలా కూర్చుండిపోయాము. కొద్దిసేపటి తర్వాత ఆ తన్మయత్వంలో నుంచి తేరుకొని గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకున్నాము. అప్పటికే సమయం 10 గంటలు కావడంతో పాలక్కడ్ వెళ్ళాలని గుర్తుకు వచ్చి కొండ కిందకి దిగాము. కొండ కిందకి వచ్చాక, పైన ఉన్నంత చలిగా లేదు. పాలక్కడ్ కు బయలుదేరాము.
ఇది రాజస్థాన్, జైపూర్ లో కలదు. ఈ పురాతన హిందూ దేవాలయం జైపూర్ లోని కొండల నడుమ ఉన్నది. ఇది జైపూర్ లోని ఓల్డ్ సిటీకి దగ్గరలో కలదు. కొండ ఎక్కుతుంటూనే మనకు చాలా కోతులు దర్శనమిస్తాయి. దీనినే ఇక్కకడి ప్రజలు కోతుల దేవాలయం అని కూడా పిలుస్తారు. ముందుగా కొండ ఎక్కిన తరవాత మళ్లీ కిందికి దిగాలి. అక్కడనుండి అసలైన ప్రయాణం మొదలవుతుంది. ప్రశాంతమైన వాతావరణం , చుట్టూ కొండలు మనల్ని పరవశింపజేస్తాయి. మొదటగా ఆంజనేయస్వామి దేవాలయం వస్తుంది. కొంచెం ముందుగా వెళితే గాల్త దేవాలయం వస్తుంది. దీని ముందు ఒక గుండం ఉంది. ఇక్కడ కోతులు ఈత కొడుతుంటే చూడటానికి భలే ముచ్చటేస్తుంది. ఇంకొంచెం ముందుగా వెళితే గోవు నోరు ఆకారం లో నుండి సన్నని నీళ్ళ ధారా కింద ఉన్న కొలనులో పడుతుంది. భక్తులు ఇక్కడ స్నానమాచరిస్తారు. ఇంకా కొంచెం కిందిగా వెళితే విష్ణువు దేవాలయం ఉంది.ఇక్కడికి రావాలనుకునేవారు నీళ్ళు, ఆహారం వెంట తెచ్చుకుంటే మంచిది ఎందుకంటే ఇక్కడ ఎలాంటి తినుభండారాలు లభ్యం కావు.
చూడవలసినవి: గాల్ట మందిరం , సూర్య దేవాలయం, విష్ణువు దేవాలయం వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కొండ కింది వరకు బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/galtaji.html ఇది రాజస్తాన్, జైపూర్ పట్టణంలో మోతి డోంగ్రీ కోట కింద ఉన్నది. దీనినే లక్ష్మీనారాయణ మందిరం అని కూడా అంటారు. దీనిని తెల్ల పాలరాతితో నిర్మించారు. పౌర్ణమి రోజున ఈ మందిరాన్ని నిండు వెన్నెల్లో చూడటానికి మన రెండు కండ్లు చాలవంటే నమ్మండి. ఈ మందిరంలోని లోపలి గోడల మీద భగవద్గీత మరియు ఉపనిషత్తులలోని శ్లోకాలను చెక్కిన తీరు అబ్బుర పరుస్తుంది. అంతే కాకుండా పురాణ గాథలను కూడా చిత్రాల రూపంలో ఆలయ లోపలిగోడల మీద మనం చూడవచ్చు. ఈ ఆలయానికి మూడు డోములు కలవు. ఒక్కొక్క డోము ఒక్కొక్క మతాన్ని (హిందూ , ముస్లిం, క్రిస్టియన్) సూచిస్తుంది. దీని దర్శించటానికి అనువైన సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు.
సందర్శన వేళలు : ఉదయం 8 నుండి మద్యాహ్నం 12 వరకు మరియు సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు . చూడవలసినవి: మందిరం , ప్లానిటోరియం వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/birla-mandir.html ఇది ఆంధ్రప్రదేశ్ లోని నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గోపలాయపల్లి గ్రామంలో కొండపైన ఉన్నది. ఇది హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాలకు మరియు నార్కెట్ పల్లి మద్యన ఉన్నది. మెయిన్ రోడ్ నుండి కొండపైకి వెళ్ళడానికి మార్గం కలదు. ఇక్కడ ప్రధాన దైవం వేణుగోపాలస్వామి. ఈ ఆలయం పచ్చని ప్రకృతి మద్య మనసుకు హాయి గొల్పుతుంది. ఈ ఆలయం ముందు సహజ సిద్దమైన కోనేరు కలదు.ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జాతర జరుగుతుంది. అప్పుడు చుట్టుపక్కన ఉన్న గ్రామాల ప్రజలు మరియు హైదరాబాద్ నుండి కూడా చాలా మంది భక్తులు దీనిని దర్శిస్తారు.
చూడవలసినవి: వేణుగోపాలస్వామి ఆలయం ,శివాలయం , శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం వసతి : కొండపైన ఉండడానికి వసతి సౌకర్యం కలదు. అందుబాటు : చిట్యాల మరియు నార్కెట్ పల్లి నుండి గోపాలాయపల్లి మెయిన్ రోడ్ వరకు బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/gopalayapalli.html ఇది ఆంధ్రప్రదేశ్ లోని నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో కొండపైన ఉన్నది. ఇది హైదరాబాద్- నల్లగొండ రహదారిపై నార్కెట్ పల్లి నుండి 6 కి.మీ దూరంలో ఉన్నది. ఎల్లారెడ్డిగూడెం మెయిన్ రోడ్ నుండి కొండపైకి వెళ్ళడానికి మార్గం కలదు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ మూడు గుండ్లు. మూడు గుండ్ల పైన శివుడు, లింగాకార రూపంలో మనకు దర్శనమిస్తాడు. ప్రతి సోమవారం ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జాతర జరుగుతుంది.
చూడవలసినవి: శివాలయం , మూడుగుండ్లు, శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి ఆలయం వసతి : కొండపైన ఉండడానికి వసతి సౌకర్యం కలదు. అందుబాటు : నల్లగొండ మరియు నార్కెట్ పల్లి నుండి ఎల్లారెడ్డిగూడెం మెయిన్ రోడ్ వరకు బస్సు సౌకర్యం కలదు.అక్కడి నుండి కొండపైకి వెళ్ళడానికి ఆటోలు లభిస్తాయి. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/cheruvugattu.html ఇది కర్ణాటక తమిళనాడు సరిహద్దులో, బెంగళూరు అర్బన్ జిల్లాలో , బాగలూరు సమీపంలో మేల్ చూడాపూరం లో ఉన్నది. ఈ పురాతన ఏకాంబరీశ్వర ఆలయంలో మూల విగ్రహం శిథిలావస్తకు చేరుకుంది. ఈ ఆలయం చోళ రాజుల పాలనలో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయాన్ని పూర్తిగా ఎర్రతివాచితో నిర్మించడంతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇది ఊరి చివర ఉండడం వల్ల ఇక్కడ జనాలు అంతగా కనిపించరు .
చూడవలసినవి: గుడి వసతి : బెంగళూరు లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బెంగళూరు నుండి హోసూరు మరియు హోసూరు నుండి బాగలూరు కు బస్సులు కలవు. . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/melchudapuram.html ఇది నల్లగొండ మరియు వరంగల్ సరిహద్దులో ఉన్నది. ఇది నల్లగొండ నుండి 110 కి.మీ, వరంగల్ నుండి 80 కి.మీ దూరంలోను ఉన్నది. ఇది హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే రహదారిపై ఆలేర్ నుండి 8 కి.మీ దూరంలో ఉన్నది. జైనులు ఈ ప్రాంతాన్ని తమ పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఇంకా ఇక్కడ పలు తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి. ఇది 2000 సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ 1.5 మీటర్ల ఎత్తున్న మహావీరుని విగ్రహం చూడొచ్చు. ఇంకా జైన మతం ఆంధ్రప్రదేశ్ లో ఎంతగా గుర్తింపు పొందిందో ఈ కొలనుపాకలో తెలుసుకోవచ్చు.
చూడవలసినవి: జైన్ మందిరం వసతి : జైన్ మందిరంలో ఉండటానికి వసతి కలదు. అందుబాటు : ఈ పట్టణం హైదరాబాద్ - వరంగల్ హైవే ఫై ఉన్నది . ఆలేర్ వరకు బస్సులో చేరుకోవచ్చు. ఆలేర్ నుండి కొలనుపాకకు ఆటోలు లభిస్తాయి. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/kolanupaka.html |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|